న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కశ్మీరీ హిందువుల మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే, బీజేపీ నేతలను అడ్డుకోకుండా విధ్వంసం జరిగేలా ఢిల్లీ పోలీసులు సహకరించారని పలువురు ఆప్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు.
బుధవారం ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసన చేపట్టి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బీజేపీ కార్యకర్తలు సీఎం నివాసాన్ని ధ్వంసం చేశారని, సీఎం ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను కొందరు సంఘ వ్యతిరేకులు ధ్వంసం చేశారని, అక్కడ ఏర్పాటు చేసిన బూమ్ బారియర్ను సైతం పగులగొట్టారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ట్విట్టర్ చేశారు.
అయితే, ‘కశ్మీర్ ఫైల్స్’పై సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు బుధవారం ఆం దోళన నిర్వహించారని ఉత్తర జిల్లా డీసీపీ సాగర్ సింగ్ కల్సి పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో దాదాపు 150-200 మంది సీఎం నివాసం వద్దకు చేరుకున్నారని, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు ఆందోళనకారులు సీఎం నివాసం వద్ద భద్రతా వలయాన్ని ఛేదించి.. వెలుపలకు వెళ్లి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.
बीजेपी के गुंडे CM @ArvindKejriwal जी के घर पर तोड़फोड़ करते रहे. बीजेपी की पुलिस उन्हें रोकने की जगह उन्हें घर के दरवाज़े तक लेकर आई. https://t.co/oSFc2kWaDC
— Manish Sisodia (@msisodia) March 30, 2022
అలాగే చిన్న రంగు డబ్బాను సీఎం నివాసం రోడ్పైకి విసిరారు. దీంతో బూమ్ బారియర్, సీసీటీవీ కెమెరాలు సైతం పగులగొట్టినట్లుగా కనిపించాయి. ఆందోళనలో పాల్గొన్న 70 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బీజేపీ యువనేత తేజస్తి సూర్య సైతం ఉన్నట్లు తెలుస్తున్నది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ నేతల తీరుపై ఢిల్లీ నేత మనిష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఇదంతా ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే జరిగిందని ఆరోపించారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ గూండాలు దాడి చేశారని, ఇది ఖండించాల్సిన విషయమన్నారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు బారికేడ్లను బద్దలు కొట్టారని, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, పంజాబ్లో ఓటమితో బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు దిగిందని ధ్వజమెత్తారు.
BJP wants #TheKashmirFiles to be tax free.
Why not ask @vivekagnihotri to upload the whole movie on YouTube for FREE?
-CM @ArvindKejriwal pic.twitter.com/gXsxLmIZ09
— AAP (@AamAadmiParty) March 24, 2022