ట్రాఫిక్ పోలీసులంటేనే ప్రజలకు అదో రకమైన తిక్క. అన్నీ ఉన్నా.. ప్రజలతో సఖ్యంగా వ్యవహరించరని, చాలా కఠినంగా వుంటారని తెగ ప్రచారంలో వుంది. అన్నీ ఉన్నా.. ఫొటోలు కొట్టి, జరిమానాలు విధిస్తారని ప్రజలు అసహ్యించుకుంటారు. కనీసం చివరికి క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్లిపోతారు.
కానీ.. ఢిల్లీలో సీన్ రివర్స్ అయ్యింది. కారు నడుపుతుండగా ఆ యజమాని హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీస్ ఫొటో తీశారు. జరిమానా కూడా విధించేశారు. ఆ తర్వాత ఆ తప్పు తెలుసుకున్న సదురు ట్రాఫిక్ పోలీసు ఆ కారు యజమానికి క్షమాపణలు చెప్పారు. ఇలా అనుకోకుండా జరిగిందని, సాంకేతికత లోపం వల్లే ఇలా వచ్చిందని ట్రాఫిక్ పోలీస్ వివరణలు ఇచ్చుకున్నారు.
కారు నడుపుతుండగా హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించాం. ఇది పొరపాటు. ఈ చలాన్ తప్పుగా జారీచేశారు. సాంకేతికత లోపంగానే ఇలా జరిగింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దాం. క్షమాపణలు చెబుతున్నాం. అత్యాధునిక పరిజ్ఞానంతో ఇలాంటి లోపాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ పోలీసులు వివరణ కూడా ఇచ్చారు.
An e-challan was erroneously issued to an individual driving a car, for not wearing helmet.
It happened inadvertently due to a technical glitch, which has now been rectified. Adoption of state of the art technology has ensured that such errors are minimised.@DelhiPolice— Delhi Traffic Police (@dtptraffic) May 20, 2022