న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించారు. ఈ నెల 26 నుంచి మెట్రో రైళ్లు, బస్సులు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 శాతం సామర్థ్యంతో సోమవారం నుంచి తెరిచేందుకు అనుమతించారు. అంత్యక్రియలు, పెండ్లి లేదా ఇతర వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను 50 నుంచి వందకు పెంచారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఈ మేరకు శనివారం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.