న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. నైజీరియన్కు మహిళకు పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య నాలుగుకు చేరగా.. దేశంలో కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే సోకగా.. మహిళకు సోకడం ఇదే తొలిసారి. బాధితురాలికి జ్వరం, చర్మంపై గాయాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లోక్ నాయక్ జై ప్రకాశ్ (LNJP) ఆసుపత్రిలో చేర్పించగా.. నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపగా.. బుధవారం పాజిటివ్గా తేలింది. మంగళవారం ఆమె ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మొదటిసారిగా మంకీపాక్స్కు పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి అయ్యాడు.