న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా నిర్వహించిన సర్వేలో శివలింగం ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రొఫెసర్ రతన్ లాల్ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెసర్ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం రాత్రి లాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రొఫెసర్ చేసిన ప్రకటన రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.