న్యూఢిల్లీ: ట్విటర్కు ఇన్నాళ్లూ ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణలను ప్రభుత్వం తొలగించిన సమయంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని గత నెలలో ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ టూల్కిట్ అని పిలుస్తున్న కేసులో ఈ విచారణ జరిగినట్లు తెలిసింది. మే 31న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీమ్ బెంగళూరు వెళ్లి మనీష్ను ప్రశ్నించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
బీజేపీ నేత సంబిత్ పాత్రా మే 18న చేసిన ట్వీట్లను ఎందుకు మ్యానిపులేటెడ్ మీడియాగా మార్క్ చేశారో చెప్పాలని ట్విటర్ ఇండియా ఎండీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. మోదీపై, ఆయన కొవిడ్ను నిర్వహించిన తీరుపై విమర్శలు చేస్తూ చేసిన ట్వీట్లను కాంగ్రెస్ టూల్గా పిలుస్తూ సంబిత్ పాత్రా ఓ ట్వీట్ చేశారు. అయితే ఈ టూల్ కిట్ ఫేక్ అంటూ ట్విటర్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఆ తర్వాత ట్విటర్.. పాత్రా చేసిన ట్వీట్ను మ్యానిపులేటెడ్ ట్వీట్గా మార్క్ చేసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు ట్విటర్కు రెండు నోటీసులు జారీ చేశారు. అయితే వీటికి ట్విటర్ ఎండీ నుంచి వచ్చిన సమాధానం సరిగా లేకపోవడంతో మే 31న బెంగళూరుకు వెళ్లి నేరుగానే ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేసినట్లు సమాచారం.
జూన్ 5 ఘజియాబాద్లో ఓ ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ట్విటర్ కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ వార్తలు సంచలనం రేపుతున్నాయి. ట్విటర్కు ఉన్న చట్టపరమైన రక్షణలు ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో యూపీ పోలీసులు ట్విటర్పై కేసు నమోదు చేశారు.