న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యానికి జనమే బాధ్యులన్న ఆయన.. వీలైతే ఇంటి నుంచే పని చేయాలని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలను మానుకోవాలని సూచించారు. వాహనాలతోనే 50శాతం కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పటాకులు పేల్చొద్దని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇవ్వడం లేదని, ఫలితంగా అక్కడ వరికొయ్యలను తగులబెడుతున్నారన్నారు. రైతులు కొయ్యలను తగలబెట్టడం ఆపాలని, రైతులు చేసిన తప్పుకు కేంద్రం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు, పంజాబ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కేంద ప్రభుత్వం సిద్ధంగా లేదని.. కేంద్రం సహకరించి ఉంటే సగం వరకు కాల్చివేతలు ఆగిపోయి ఉండేవన్నారు. రెండు రోజులుగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్యం స్థాయి పెరిగిందని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. యూపీ, హర్యానాలో కూడా ఏక్యూఐ స్థాయి పెరిగిందని, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని యూపీ, హర్యానా ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ కేటగిరిలో నమోదైంది. ఏక్యూఐ 354గా రికార్డవగా.. నోయిడాలో 406, గురుగ్రామ్లో 346గా రికార్డయింది.