న్యూఢిల్లీ, మార్చి 23: మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆప్ ఆరోపించింది. మద్యం పాలసీ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్చంద్రారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారని.. అతని ఫార్మా కంపెనీ కొన్ని కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లను బీజేపీకి ఇచ్చిందని.. మరి అలాంటప్పుడు ఓ నిందితుడి సొమ్ము పార్టీ ఖాతాలో వేసుకున్నందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా అరెస్ట్ చేస్తారా అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ ప్రశ్నించారు. శరత్చంద్రా రెడ్డి వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని ఆతిశీ తెలిపారు. అయితే అరెస్ట్కు ముందు శరత్చంద్రా రెడ్డి తానెప్పుడూ అరవింద్ కేజ్రీవాల్ను కలవలేదని, ఆప్తో తనకెలాంటి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పాడని ఆతిశీ పేర్కొన్నారు. జైలుకెళ్లాక ఆయన అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇవ్వడంపై ఆమె సందేహం వ్యక్తం చేశారు.