న్యూఢిల్లీ : కుండపోతతో వణికిన దేశ రాజధాని ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్లీ డేంజర్ బెల్స్ మోగాయి. యుమునా నదిలో వరద ప్రవాహం మళ్లీ ప్రమాద స్ధాయిని దాటడంతో ఢిల్లీ (Delhi Floods) ఉలిక్కిపడింది. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేయడంతో యమునా నది ఉప్పొంగింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో యమునా నదిలో నీటి ప్రవాహం ఏకంగా 206.31 మీటర్లకు చేరి ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తోంది.
వరద ముప్పు పొంచి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు., అంతకుముందు ఉదయం ప్రమాదస్ధాయి 205.33 మీటర్ల నుంచి స్వల్పంగా 205.81 మీటర్లకు చేరిన యమునా నది నీటి ప్రవాహం సాయంత్రానికి డేంజర్ లెవెల్ను మించి ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలతో హరియాణలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. బ్యారేజ్ నుంచి నదిలోకి రెండు లక్షలకుపైగా క్యుసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు నోయిడాలో హిందన్ నదిలో వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇండ్లు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
Read More :
high blood pressure| ఒక్క ఇంజెక్షన్తో ఆర్నెల్లపాటు బీపీ అదుపులో..