న్యూఢిల్లీ: ఏకంగా ఒక సొరంగాన్నే తవ్వి కంపెనీ పైప్లైన్ నుంచి ఆయిల్ను దర్జాగా చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పోచన్పూర్కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు.
పైపునకు దగ్గరగా ఉన్న తన స్థలం నుంచి సొరంగం తవ్వాడు. పైపులైన్లోని ఆయిల్ను తోడేయడం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి బండారాన్ని బట్టబయలు అయింది.