Malviya Nagar : ఢిల్లీలోని ఒక హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల ప్రాథమిక నిర్ధరణ ప్రకారం ఈ ఘటనకు హోటల్ చెఫ్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు చెఫ్ కేశవ్ నాగి (65)ని శనివారం అరెస్టు చేశారు. రెండు రోజుల పోలీసు కస్టడీలో భాగంగా అతడిని విచారిస్తున్నారు.
పోలీసులు దాదాపు అరగంట విచారించినట్లు తెలిసింది. ఘటన జరగడానికి కారణాన్ని వెల్లడించాడు. వంట చేస్తుండగా ఉన్నట్లుండి సిలిండర్ పేలిందని, ఆ తర్వాత మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో తాను భయపడి అక్కడ్నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. అంటే, అతడి నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఇదే సమయంలో హోటల్ యజమాని లవకేశ్ బాజాజ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హోటల్ లైసెన్స్, ఓనర్షిప్ వివరాలు, ఆర్థిక అంశాలు, భద్రతా ప్రమాణాలు వంటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా పోలీసులు హోటల్ జై మిశ్రాను పట్టుకోలేకపోయారు. ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు.
అతడి కోసం బిహార్, యూపీ సహా అనేక చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ వ్యవహారాలు అన్నీ అతడే చూసుకునేవాడని యజమాని బజాజ్ తెలిపారు. దీంతో ఈ కేసులో అతడి వాంగ్మూలం కూడా కీలకం కానుంది. పోలీసులు ఓనర్ బజాజ్పై అనేక సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అగ్ని ప్రమాదంలో శరీరం కాలిపోవడం కంటే ఊపిరి ఆడకపోవడం వల్లే ఎక్కువ మంది చనిపోయారని వెల్లడైంది.