న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కొవిడ్-19 హాట్స్పాట్గా మారుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 20,181 తాజా కొవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. మహమ్మారితో బాధపడుతూ ఒక్క రోజులోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 18 శాతానికి చేరువవడం ఆందోళన రేకెత్తిస్తోంది. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే మరిన్ని కఠిన నియంత్రణలను అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రోజురోజుకూ కొవిడ్-19 కేసులు ఎగబాకుతున్నాయి. దేశంలో శనివారం 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
మహమ్మారి బారినపడి గత 24 గంటల్లో 285 మంది మరణించగా కొవిడ్-19 పాజిటివిటీ రేటు 9.28 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల డోసులను దాటింది.