Minish Sisodia | సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. అంతకు ముందు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్పై ఆదేశాలు ఇచ్చే వరకు సిసోడియా తన భార్యతో మాట్లాడేందుకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య వర్చువల్ విధానంలో మాట్లాడేందుకు జైలు సూపరింటెండెంట్ని ఆదేశించారు. సిసోడియా ప్రస్తుతం సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ కేసులో కూడా ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది.
సిసోడియా భార్య మల్టిపుల్ స్ల్కీరోసిస్తో బాధపడుతున్నారు. మనీష్ సిసోడియా తనయుడు చదువుల కోసం వెళ్లగా.. ఆయన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే, ఒంటరిగా ఉండడంతో ఒత్తిడికి గురవుతున్నారని, మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధితో బాధపడే రోగికి శరీరంపై మెదడు నియంత్రణ తగ్గిపోతుందని ఆమెకు చికిత్స అందిస్తున్న అపోలు వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి కారణంగా రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుందని. నడవడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బందిపడుతారని వైద్యులు వివరించారు.