న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి.. 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 16.2, కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రెండు మూడు రోజుల పాటు చలిగాలులు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్లో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని చాలా చోట్ల చలితీవ్రత పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని గురుగ్రామ్లో మరోసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ ఉష్ణోగత్రలు 11.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5.6 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 12.6, కనిష్ఠం 6.5 డిగ్రీలు నమోదైంది. లోధిరోడ్లో 16.5-5.0, దిరిడ్జ్లో 15 -4.1, ఆయానగర్లో 142-4.0, ఫరీదాబాద్లో 16.3-8.6, ఘజియాబాద్లో 13.1-6.6, జాఫర్పూర్ 11.0 -4.2, ముంగేష్పూర్ 11.4 -5.3 నోయిడా 14.8- 6.19 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.