HomeNationalDelhi Iiit Invitation To Telugu Rythubadi
తెలుగు రైతుబడికి ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం
డిజిటల్ మీడియా వేదికల ద్వారా రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందజేస్తున్న ‘తెలుగు రైతుబడి’కి అరుదైన గౌరవం దకింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఈ ఏడాదికి నిర్వహించే ఆంత్రోప్రెన్యూర్షిప్ సమ్మిట్లో పాల్గొని, ప్రసంగించాలని రైతుబడి సంస్థ స్థాపకుడు జూలకంటి రాజేందర్ రెడ్డిని ఆహ్వానం అందింది.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ మీడియా వేదికల ద్వారా రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందజేస్తున్న ‘తెలుగు రైతుబడి’కి అరుదైన గౌరవం దకింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఈ ఏడాదికి నిర్వహించే ఆంత్రోప్రెన్యూర్షిప్ సమ్మిట్లో పాల్గొని, ప్రసంగించాలని రైతుబడి సంస్థ స్థాపకుడు జూలకంటి రాజేందర్ రెడ్డిని ఆహ్వానం అందింది.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాలను చర్చించేందుకు రావాలని ఐఐఐటీ కోరింది. ఈ నెల 15, 16 తేదీలలో ఈ సదస్సు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరుగనున్నది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవలే జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన జాతీయ ఉత్తమ క్రియేటర్ల అవార్డుల్లోనూ.. వ్యవసాయ చానెళ్ల క్యాటగిరీలో రైతుబడి అత్యధిక ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.