న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తున్నది. బయటి దేశాల్లో ఒమిక్రాన్ విస్తృతిని చూసి పొరుగు దేశాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమావేశమై.. కొత్త వేరియంట్ను ఎలా ఎదర్కోవాలనేదానిపై చర్చించారు. అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకోవడమేగాక వారికి సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు తన పరిధిలో అన్ని ఆస్పత్రులకు హై అలర్ట్ జారీచేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్యాహ్నం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. అక్కడి చీఫ్ సెక్రెటరీ, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బహరంగ ప్రదేశాలు, ఫంక్షన్లలో కొవిడ్ ప్రొటోకాల్ను స్ట్రిక్ట్గా పాటించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఢిల్లీలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడి అత్యవసర పరిస్థితులే వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.