న్యూఢిల్లీ: గుజరాత్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ చంద్ర వర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులుపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే తన తొలగింపును సవాల్ చేస్తూ సతీశ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై ఎనిమిది వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ దర్యాప్తులో ఐపీఎస్ అధికారి సతీశ్ వర్మ సహకరించారు. ఆయన వాస్తవానికి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవీ విరమణకు ఒక నెల ముందుగానే ఆగస్టు 30న సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడి అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతీశారంటూ ఆయన్ను విధుల నుంచి తొలగించడం విమర్శలకు దారితీసింది.