న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు కారణాలను రాతపూర్వకంగా సదరు నిందితుడికి తెలియజేయడం తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి 24 గంటలలోగా సమాచారం ఇవ్వాలని మాత్రమే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) చెప్తోందని తెలిపింది. ‘న్యూస్క్లిక్’ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వివరణ ఇచ్చింది. ఆయనను అరెస్టు చేయడంలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరగలేదని చెబుతూ పిటిషన్ను తోసిపుచ్చింది. చైనాకు అనుకూల ప్రచారం చేయడం కోసం నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ నెల 3న ఆయనను అరెస్ట్ చేశారు.