న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని స్పైవేర్ పరికరాల ద్వారా రికార్డు చేయడం, పరిశీలించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మొబైల్ స్పైవేర్ లేదా మాల్వేర్ చాలా ప్రమాదకరమైనవని, మొబైల్ వినియోగదారులపై పూర్తిస్థాయిలో వాటితో నిఘా పెట్టొచ్చని పిటిషనర్, న్యాయవాది డింపుల్ వివేక్ పేర్కొన్నారు. స్పైవేర్ విక్రయం, ప్రకటనలపై నిషేధం విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ వీ కామేశ్వర్రావు విచారణ జరిపారు. పిటిషన్లో పేర్కొన్న కొన్ని స్పైవేర్ విక్రేతలతో పాటు గూగుల్ కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.