న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఢిల్లీలో పాలనా వ్యవహారాలకు సంబంధించిన అధికారాలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఢిల్లీలో అధికార నియంత్రణకు సంబంధించిన వివాదాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి పంపాలన్న కేంద్రం వాదనపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ స్పందిస్తూ.. పరిగణనలోకి తీసుకొని, బెంచ్ ఏర్పాటు చేసేది లేనిది వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది. కాగా, కేంద్రం వాదనను కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఎన్నికైన ప్రభుత్వం కంటే లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు ఇచ్చిందని పేర్కొన్నది.