న్యూఢిల్లీ: విడిపోయిన భార్యకు గుణపాఠం చెప్పేందుకు ఒక వ్యక్తి తన కుమారుడ్ని హత్య చేశాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు జిమ్ ట్రైనర్గా పని చేస్తున్న కొడుకును కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. కుమారుడ్ని చంపేందుకు ఆ తండ్రి మూడు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (Delhi father killed gym trainer son) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 6 అర్ధ రాత్రి వేళ 54 ఏళ్ల రంగ్ లాల్ తన కుమారుడైన 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్తో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తండ్రి చెంపపై గౌరవ్ కొట్టాడు. ఆగ్రహించిన రంగ్ లాల్ తన కుమారుడ్ని కత్తితో 15 సార్లు పొడిచాడు. దీంతో రక్తం మడుగులో పడి గౌరవ్ సింఘాల్ చనిపోయాడు.
కాగా, కుమారుడి హత్య తర్వాత ఇంటి నుంచి పారిపోయిన తండ్రి రంగ్ లాల్ను రాజస్థాన్ రాజధాని జైపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి తీసుకెళ్లిన రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల డబ్బును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కుమారుడు గౌరవ్ జల్సా జీవనశైలి, తన పట్ల విధేయత లేకపోవడంపై తండ్రి రంగ్ లాల్ తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నాడు.
మరోవైపు కుమారుడికి మద్దుతుగా ఉన్న విడిపోయిన భార్యకు గుణపాఠం చెప్పేందుకు ఈ హత్య చేసినట్లు తండ్రి రంగ్ లాల్ పోలీసులకు చెప్పాడు. కొడుకు హత్య కోసం మూడు నెలలుగా ప్లాన్ చేసినట్లు తెలిపాడు. దీని కోసం ముగ్గురు వ్యక్తులకు రూ.75,000 చెల్లించినట్లు చెప్పాడు. కొడుకును హత్య చేయడంపై ఎలాంటి పశ్చాత్తాపం చెందడం లేదన్న తండ్రి రంగ్ లాల్ తన చర్యను సమర్ధించుకున్నాడని పోలీస్ అధికారి వెల్లడించారు.