న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింది.
ఇటలీ కేంద్రంగా ఉన్న ఆంగ్లో-ఇటాలియన్ హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా వెస్ట్ల్యాండ్ నుంచి 12 ఏడబ్ల్యూ101 చాపర్ల కొనుగోలుకు 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ కాంట్రాక్టు విలువ రూ. 3,600 కోట్లు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. వీవీఐపీలు, ఇతర ప్రముఖులను తీసుకెళ్లేందుకు ఈ హెలికాప్టర్లను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మకు ఈ ఏడాది ఏప్రిల్లో బెయిల్ లభించింది.