న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 23 వరకు పొడిగించారు. మరోవైపు ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను తక్షణం విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఈడీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదావేసింది.