న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏఎస్ఐ బీభత్సం సృష్టించాడు. మద్యమత్తులో ఉన్న పోలీసు అధికారి తన కారుతో ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. మంగవారం రాత్రి తన కారుతో ద్వారకా ప్రాంతంలో అలజడి సృష్టించారు. విచక్షణ రహితంగా కారు నడుపుతూ.. రెడ్ సిగ్నల్ వద్ద ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టాడు. దీంతో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈప్రమాదంలో ఏఎస్ఐ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ నుంచి రక్తపు నమూనాలను తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదుచేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Case registered against an ASI of Delhi Police, posted in Outer dist for ramming 6 vehicles, including a PCR van, at a red light in Dwarka Mor area last night. He was travelling in his private car when the accident took place. 4 people incl ASI sustained injuries: Delhi Police pic.twitter.com/2jFTW0c90Q
— ANI (@ANI) January 4, 2023