ఎమ్మెల్యే టీ రాజయ్య
జనగామ చౌరస్తా, మార్చి 31 : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సంబంధిత హౌజింగ్బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ కే నిఖిల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ సంబంధిత అధికారులు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల నిర్మాణాన్ని, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి జనగామ జిల్లాను రాష్ట్రంలో ముందుం చాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, హౌజింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
3న జనగామలో కవి సమ్మేళనం : కలెక్టర్
జనగామ చౌరస్తా : స్వతంత్ర భారత్ అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల 3న జనగామలో కవి సమ్మేళనం నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం ఆమె ఒక ప్రకటన చేశారు. హన్మకొండ రోడ్డు మార్గంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో 3న సాయంత్రం 3 గంటలకు కవి సమ్మేళనం ప్రారంభమ వుతుందని ఆమె పేర్కొన్నారు