న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉన్నది. అదే ఊపులో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార బీజేపీని గద్దెదించి విజయ పతాకం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నది.
ఈ క్రమంలో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కర్ణాటకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే గెలుపే లక్ష్యంగా అన్ని విధాలుగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Delhi | Congress national president Mallikarjun Kharge chairs a meeting with party leaders from Karnataka over the forthcoming Karnataka assembly elections. pic.twitter.com/doYDZRWGhK
— ANI (@ANI) December 12, 2022