Arvind Kejriwal | బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ రాక్షసులను అంతం చేసే పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ అరెస్టు చేయడంపై బీజేపీ మండిపడ్డారు.
ఆ తర్వాత సిసోడియా, కైలాష్ గెహ్లాట్ను అరెస్టు చేస్తారని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతో.. అవినీతి పేరుతో ఆప్ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్కు పెరుగుతున్న ప్రజాదరణను బీజేపీ జీర్ణించుకోలేక తమ పార్టీ మంత్రులు, నేతలను తప్పుడు అవినీతి కేసుల్లో ఇరికించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్కి పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ ఖంగుతిందన్నారు.
గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కవరేజీ ఇవ్వొద్దని, ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రధాని సలహాదారు హిరేన్ జోషి టీవీ చాలెన్స్ యజమానులు, సంపాదకులను హెచ్చరించారంటూ మండిపడ్డారు. మరో వైపు ఆమ్ ఆద్మీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. మద్యం దొంగలు తమను తాము వెన్న దొంగలుగా పిలుచుకుంటున్నారని ఆ పార్టీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు.