గ్వాలియర్/న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న ‘బహిరంగ’ లూటీ ఫలితంగానే ధరలు పెరిగాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని విమర్శించారు. గ్వాలియర్లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముంబైలో ఓ స్నేహితుడికి రూ.34 వేల కోట్ల రుణం, గుజరాత్కి చెందిన వ్యక్తికి రూ.22 వేల కోట్లు, మొత్తంగా రూ.11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం,ధరల నియంత్రణ తదితర అంశాలను వ్యతిరేకిస్తున్న బీజేపీనే ‘అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ’ అని టీఎంసీ ఎంపీ ఓబ్రియన్ అభివర్ణించారు.