న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు బోగస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకే పెట్టారని తాము మొదట్నుంచీ చెప్తున్నామని గుర్తు చేశారు.
ఈ కేసులో అరస్టైన రాజేశ్ జోషి, గౌతం మల్హోత్రకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ ఆప్ నిజాయితీ కలిగిన పార్టీ అని కోర్టు ఉత్తర్వులు నిరూపించాయన్నారు. లిక్కర్ పాలసీపై అబద్ధపు ఆరోపణలు చేసిన బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు.