న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. గుజరాత్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పుతుందని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. అక్కడ తాము దాదాపు 100 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మొత్తం 182 నియోజకవర్గాలున్న గుజరాత్ అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 38 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని, ఆప్ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని, ఆ పార్టీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలిచే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి.