న్యూఢిల్లీ, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతును కూడగడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో డి.రాజా, నారాయణతోపాటు పలువురితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం చేస్తున్న పోరాటాన్ని మద్దుతుగా ఉంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.