న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన ఒక ఎంపీ, జల్ బోర్డ్ అధికారులపై తన ప్రతాపం చూపారు. ఘాట్ను శుభ్రం చేయిస్తున్న వారిని దుర్భాషలాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఛత్ పూజ నేపథ్యంలో ఢిల్లీ జల్ బోర్డ్ అధికారులు యమునా ఘాట్ను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. ఢిల్లీ పశ్చిమ ఎంపీ పర్వేష్ వర్మ అక్కడకు చేరుకున్నారు. ఘాట్ను శుభ్రం చేయిస్తున్న అధికారులతో వాదనకు దిగారు. ఎనిమిదేళ్ల వరకు యమునా నది శుభ్రం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు హడావుడిగా రసాయనాలు చల్లుతున్నారని విమర్శించారు. ‘ఈ నీటిలో మొదట మీరు మునగండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెమికల్స్ను మీ తలపై పోయమంటారా? మీకు సిగ్గు లేదా? అంటూ వారిని దుర్భాషలాడారు.
కాగా, బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీ జల సంఘం అధికారులను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తన చర్యను బీజేపీ ఎంపీ సమర్థించుకున్నారు. ఢిల్లీ సీఎం, మంత్రులు దీనిపై మాట్లాడకపోతే, తామే అధికారులతో మాట్లాడతామని తెలిపారు. వారు కూడా మాట వినకపోతే సాధారణంగానే కోపం వస్తుందన్నారు. ఢిల్లీ నివాసితులకు విష నీటిని ఇవ్వాలని బావిస్తే, సంబంధిత అధికారులతో దురుసుగానే మాట్లాడతానని మీడియాతో అన్నారు. ఇది తన కోసం కాదని, ఢిల్లీ ప్రజల కోసమని వ్యాఖ్యానించారు.
Chhath Puja Showdown | BJP neta misbehaves with Jal Board officials in Delhi.@Milan_reports brings us all the details#ITVideo (@snehamordani) pic.twitter.com/mRxNZCzEPF
— IndiaToday (@IndiaToday) October 28, 2022