న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ విద్వేషంతో మాట్లాడారు. ఒక వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపై వివాదం రాజుకుంది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఇటీవల బహిరంగ సభలో మాట్లాడారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రసంగించారు. తోపుడు బండ్లపై కూరగాయలు అమ్మే ముస్లింల నుంచి కొనుగోలు చేయవద్దని అన్నారు. చేపలు, మాంసం షాపులకు లైసెన్స్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేసి వాటిని మూయించాలని పిలుపునిచ్చారు. ‘మీరు వారి తలని సరిచేయాలనుకుంటే, వారిని సరిదిద్దాలనుకుంటే వారిని ఎక్కడ చూసినా పూర్తిగా బహిష్కరించడం ఒక్కటే నివారణ. మీరు అంగీకరిస్తే మీ చేయి పైకెత్తండి’ అని అన్నారు. దీంతో ఆ సభలో ఉన్న వారు ఆయనకు మద్దతుగా చేతులు పైకి ఎత్తారు.
బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అంతటితో ఆగలేదు. ‘మేం వాటిని బహిష్కరిస్తాం. మేం వారి దుకాణాల నుంచి ఏమీ కొనం. వారికి ఎటువంటి పని ఇవ్వం’ అంటూ ఆ సభలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ కూడా విద్వేష పూరితంగా మాట్లాడారు. మన అందమైన నగరం పందుల నగరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
BJP MP Parvesh Verma orders the people of Delhi to financial boycott Muslims. Will @DelhiPolice act against this man for inciting hatred amongst communities? Does PM Modi condone this speech? Is this what BJP meant by Sabka Saath Sabka Vikas! Speak up @narendramodi pic.twitter.com/L8XtjlxbQB
— Dr. Shama Mohamed (@drshamamohd) October 9, 2022