Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కారణంగా మరోసారి గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. దాంతో, భవనాలతో పాటు ఇతర నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఎయిర్ క్వాలిటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశాడు. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్ట వద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 400లకు పడిపోయింది. ఒక రోజు గాలి నాణ్యత ఆదివారం సాయంత్రం 4 గంటలకు 407 ఉంది. గాలి నాణ్యత 400-500 మధ్య ఉంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఎయిర్ క్వాలిటీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘గాలి వేగం తగ్గిపోవడంతో పాటు వాతావరణంలో మిక్సింగ్ లేయర్ తగ్గిపోవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతోంది’ అని వాతావరణ శాఖ సైంటిస్ట్ విజయ్ సోని వెల్లడించాడు.
నెల రోజుల క్రితం గాలి నాణ్యత బాగా తగ్గిపోవడంతో ఢిల్లీలోకి భారీ వాహనాలు, డీజిల్తో నడిచే బండ్లను అనుమతించలేదు. సూళ్లకు కూడా కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. అయితే పరిస్థితి మెరుగుపడడంతో నవంబర్ 14 తేదీన ఆ నిషేధం ఎత్తివేశారు.