Gold Seized | ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తాష్కెంట్ నుంచి వచ్చిన ఉబ్జెకిస్థాన్కు చెందిన వ్యక్తి నుంచి రూ.8.16కోట్ల విలువైన రూ.16.570 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగారం తరలింపునకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.