న్యూఢిల్లీ, మే 21: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఓ శస్త్ర చికిత్సతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మూడు నెలల చిన్నారికి బైలాటరల్ లాపరోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సదరు చిన్నారికి కిడ్నీల నుంచి మూత్రాశయం వరకు మూత్రం సరిగ్గా వెళ్లడం లేదు. రెండు కిడ్నీల్లో అడ్డంకులు ఉన్నాయి. దీంతో వైద్యులు ఆ చిన్నారికి అతి క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు.