న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అర్హులందరికీ కొవిడ్ టీకా మొదటి డోసు వేసి, వందశాతం లక్ష్యం చేరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. 148.33లక్షల మంది మొదటి డోసు వేశామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్లో కీలకంగా పని చేసిన వైద్యులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్కలను, డీఎంలు, సీడీఎంఓలు, డీఐఓలకు అభినందలు తెలిపారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ 67 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.