న్యూఢిల్లీ, మే 26: కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్టీఆర్-4 దాఖలు చేయడంలో జాప్యంపై విధించే ఆలస్య రుసుమును మే 1 నుంచి జూన్ 30 వరకు మాఫీ చేస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం తెలిపింది. ఆలస్య రుసుమును ప్రస్తుతం రోజుకు రూ. 50 చొప్పున విధిస్తున్నారు.