న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిఘాను కట్టుదిట్టం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మోహరింపు వల్ల ఉత్తర సెక్టార్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నదని పేర్కొంటూ రాజ్నాథ్ ఈ సూచన చేశారు.
ఢిల్లీలో బుధవారం ఆయన ఆర్మీ కమాండర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని తదనుగుణంగా సైనిక బలగాల ప్రణాళికలను, వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు. లడఖ్ తూర్పు ప్రాంతంలో మూడేండ్ల నుంచి చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.