బెంగళూరు, మార్చి 30: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) హైదరాబాద్, బెంగళూరు యూనిట్లతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.3,102 కోట్లు విలువైన రెండు ఒప్పందాలు చేసుకున్నది. హైదరాబాద్ యూనిట్ వైమానిక దళానికి ఇన్స్ట్రుమెంటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రేంజ్(ఐఈడబ్ల్యూఆర్) వ్యవస్థను అందించనున్నది. ఇక ఐఏఎఫ్ యుద్ధ విమానాలకు బెంగళూరు యూనిట్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్(ఈడబ్ల్యూ)సూట్లను సరఫరా చేయనుంది.