లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగింది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న కమలనాధులు సీఎం యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో తిరిగి పాలనా పగ్గాలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. యోగి వెన్నంటే పార్టీ నిలిచిఉందనే సంకేతాలు పంపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సైతం యోగిని ఆకాశానికి ఎత్తేశారు.
మహరాజ్గంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాధ్ సింగ్ యోగి ఆదిత్యానాధ్ పేరు చెబితేనే నేరస్తులు వణికిపోతున్నారని అన్నారు. యోగి నిజాయితీపై ఎవరికీ సందేహాలు లేవని చెప్పుకొచ్చారు. యోగి ఆధ్యాత్మిక గురువు అవైద్యనాధ్ విగ్రహావిష్కరణ సభలో రాజ్నాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు.