సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం ఎంతో బాధించిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆయన అకాల మరణం దేశ రక్షణ వ్యవస్థకు, ప్రజలకు పూడ్చలేని లోటు అని అన్నారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన అత్యంత దురదృష్ట సంఘటన అని, ఈ దుర్ఘటనలో రావత్ భార్య, ఇతర సిబ్బంది మరణించడం కూడా అత్యంత బాధాకరమని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.