గ్యాంగ్టక్: సిక్కిం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. జవాన్ల మరణవార్త తనను బాగా కలచివేసిందన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధించిందని పేర్కొన్నారు.
మరణించిన జవాన్ల కుటుంబసభ్యులకు రాజ్నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.