న్యూఢిల్లీ: డీప్ఫేక్స్ కంటెంట్ (ఫొటోలు, వీడియోలు)తో ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా అడ్డుకునేందుకు సోషల్మీడియా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాలని, భారత నిబంధనల్ని అనుసరించి ఓ విధానాన్ని వారంలోగా తీసుకురావాలని కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఐటీ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ యంత్రాంగం లేదా యూజర్ల నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, 12 రకాల కంటెంట్ను తొలగించాలని కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఐటీ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.