న్యూఢిల్లీ: లఢక్కు రాష్ట్ర హోదా, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తలపెట్టిన 21 రోజుల ఆమరణ నిరాహార దీక్షను పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మంగళవారం విరమించారు. డిమాండ్ల సాధనకు తన పోరాటం ఆగదని, ఇకముందు కూడా కొనసాగుతుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బుధవారం నుంచి మహిళా గ్రూపులు దీక్షను కొనసాగిస్తాయని ప్రకటించారు.