న్యూఢిల్లీ: ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్డేట్ చేయడానికి గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం ప్రకటించింది.
వ్యాలిడ్ బ్యాలెన్స్ ఉన్న ఫాస్టాగ్స్కు కేవైసీ అసంపూర్ణంగా ఉంటే, వాటిని బ్యాంకులు జనవరి 31 తర్వాత డీయాక్టివేట్ చేస్తాయని ఈ నెల 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక వాహనానికి అనేక ఫాస్టాగ్స్ను ఉపయోగించడం కానీ, అనేక వాహనాలకు ఒకే ఫాస్టాగ్ను వాడటం కానీ జరగకుండా చూసేందుకు ‘ఒక వాహనం, ఒకే ఫాస్టాగ్’ విధానాన్ని ఎన్హెచ్ఏఐ అమలు చేస్తున్నది.