బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అనేకల్ ఏరియాలోగల మొట్టనల్లూరు చెరువులో చేపలన్నీ చచ్చి నీటిపై తేలియాడుతున్నాయి. తౌటే తుఫాన్ కారణంగా భారీ వర్షం కురవడం, ఆ వర్షానికి వివిధ మురుగు కాల్వల ద్వారా నీరు భారీగా మొట్టనల్లూరు చెరువులోకి చేరడమే చేపల మృతికి కారణమని అధికారులు చెబుతున్నారు. నగరంలోని వివిధ పరిశ్రమలు రసాయన వ్యర్థాలను మురుగు కాల్వలలోకి వదులుతున్నాయని, వేసవిలో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన ఆ వ్యర్థ రసాయనాలు ఇప్పుడు వర్షాలవల్ల చెరువులోకి చేరడంతో చెరువులోని నీరంతా విషతుల్యం అయ్యిందని తెలిపారు. చెరువుపై చేపలు చచ్చి తేలుతున్న దృశ్యాలను కింది చిత్రాల్లో మీరు కూడా చూడవచ్చు.