బెంగళూరు, ఆగస్టు 7: జీవితమంతా కష్టాలు అనుభవించిన చచ్చిన తర్వాత అం త్యక్రియలన్నా ప్రశాంతంగా నిర్వహించాలని అంటుంటారు పెద్దలు. కానీ, కర్ణాటకలోని ఓ గ్రామస్తులకు ఆ అదృష్టం కూడా లేకుండాపోయింది. శివమొగ్గ జిల్లా కొడ్లు గ్రామంలో ప్రతి వర్షాకాలంలో స్మశానానికి వెళ్లే దారులన్నీ వరదలతో మూసుకుపోతాయి. దీంతో గ్రామంలో ఎవరైనా చనిపోతే పాడెను ఎత్తుకొని భుజాలలోతు నీటిలో వాగును దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల గ్రామంలో ఓ వ్యక్తి చనిపోవటంతో నానా కష్టాలు పడుతూ గొంతుదాకా వస్తున్న నీటిలో శవాన్ని తీసుకెళ్తున్న వీడియో వైరల్ అయ్యింది. తాము ఏటా ఇదే సమస్య ఎదుర్కొంటున్నామని, ఎవరికి విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గ్రామం సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం కొసమెరుపు.