భోపాల్: మధ్య ప్రదేశ్లోని సిల్లెర్పూర్ గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. వీటిని పట్టణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
సిల్లెర్పూర్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, తాను అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వడిల్ మాట్లాడుతూ, ఈ అటవీ ప్రాంతం ఆవుల మృతదేహాల డంపింగ్ యార్డుగా మారిపోయిందన్నారు. కరైనా పురపాలక సంఘం ప్రాంతం నుంచి వీటిని తీసుకొచ్చి, ఇక్కడ పడేస్తున్నారన్నారు.