న్యూఢిల్లీ, జనవరి 6: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ హ్యాక్ అయిందని, ఖాతాదారుల వివరాలు లీక్ అయ్యాయని ఇజ్రాయెల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ రిసెర్చర్ అలన్ గాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన లింక్డిన్లో వివరాలను వెల్లడించారు. 23.5 కోట్ల మంది ట్విట్టర్ ఖాతాదారుల వివరాలు, ఈమెయిల్ చిరునామాలు లీక్ అయ్యాయని తెలిపారు. డిసెంబర్ 24న కూడా ట్విట్టర్ ఖాతాదారుల వివరాలు లీక్ అయ్యాయని అలన్ గాల్ వెల్లడించారు. డార్క్వెబ్లో ఓ హ్యాకర్ 40 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల వివరాలను అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. అయితే, ఈ విషయంపై ట్విట్టర్ కానీ, దాని సీఈవో ఎలాన్ మస్క్ కానీ ఇంతవరకు స్పందించలేదు.